దొడ్ల ఉషయ్య కుటుంబానికి 60 వేలు సీపీఐ(ఎం) ఆర్థిక సాయం

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: భారత కమ్యూనిస్టు పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ సభ్యులు దొడ్ల ఊశయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అంకిరెడ్డి గూడెంలో పదవరోజు సందర్భంగా శనివారం ఉషయ్య కుటుంబానికి పరామర్శించి సంతాప సభ నిర్వహించారు. సీపీఐ(ఎం) చౌటుప్పల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దొడ్ల ఉషయ్య కుటుంబానికి 60,000 ఆర్థిక సాయం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎండి జాంగిర్ మాట్లాడుతూ ఎర్రజెండా నీడలో తన నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు ప్రజల కోసం పనిచేశారని అన్నారు.దొడ్ల ఉషయ్య కుటుంబానికి సీపీఐ(ఎం) పార్టీ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని ఎండి జాంగీర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి,చౌటుప్పల్ పట్టణ కార్యదర్శి బండారు నరసింహ,జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్ ,సీపీఐ(ఎం) కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గోపనగొని లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు గోశిక స్వామి,బత్తుల లక్ష్మయ్యగౌడ్,బత్తుల దాసు,బావండ్లపల్లి స్వామి,గోశిక కరుణాకర్,ఉష్కాగుల రమేష్ గౌడ్, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,భీమనగోని బాలరాజు, మహిళా సంఘం అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి, బత్తుల జయమ్మ,దోనూరు నిర్మలమ్మ,దొడ్ల ఉసయ్య కుటుంబ సభ్యులు దొడ్ల అండాలు,రమేష్,రాధిక తదితరులు పాల్గొన్నారు
Spread the love