పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు…8 మంది అరెస్ట్.

– 19 వేల నగదు, ద్విచక్ర వాహనం,7 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్  స్వాధీనం.
– సిరిసిల్ల టౌన్ ఇంచార్జ్ సి.ఐ సదన్ కుమార్.
నవతెలంగాణ సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ నగర్ లోని సిరిగిరి చిన్న నర్సయ్య అనే వ్యక్తి ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం రాగా పేకాట స్థావరం పై దాడి చేసి పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పట్టుకుని వారి నుండి 19 వేల నగదు,7 మొబైల్ ఫోన్స్, ద్విచక్ర వాహనం, ప్లేయింగ్ కార్డ్స్  స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని సి.ఐ సదన్ కుమార్ తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన సిరిగిరి చిన్న నరసయ్య బిజీగ పరుశరాములు బి వై నగర్ కు చెందిన తుమ్మరాజు వెంకంపేటకు చెందిన గుండ సతీష్ రగుడు కు చెందిన వంగ వెంకటేశం బొగ్గుల రాజేందర్ శ్రీనగర్ కాలనీకి చెందిన బూర్ల అమర్నాథ్ సంజీవయ్య నగర్ కు చెందిన పెరుమండ్ల ప్రవీణ్ లను పట్టుకున్నట్లు సిఐ సదన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ….సులభ సంపాదనకు అలవాటుపడి కొంతమంది ఈ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతు ఆభరణాలు, వాహనాలను తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నా,వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిత్యం పోలీస్ ల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై నిఘా ఏర్పాటు చేసి  తనిఖీలు నిరహిస్తామని ఎవరైన, గ్యాంబ్లింగ్,  బెట్టింగులకు కానీ, పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు.మీ ప్రాంతంలో ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నవి తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ కు లేదా డయల్100 కి సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు.

Spread the love