– బీసీలకు రాజ్యాంగ బద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చి 42 శాతం రిజర్వేషన్ పెంచాలి
– బిజెపి పార్టీ ద్వంద వైఖరి వీడాలి
– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్
నవతెలంగాణ-కల్వకుర్తి : బల్మూరు మండల కేంద్రంలో బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గవర్నర్ కు పంపిస్తే ఆమోదం తెలపకుండా నిర్లక్ష్యం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆరు నెలల కింద రాష్ట్రపతి గారికి కూడా పంపిస్తే ఆ ఫైల్ ని తొక్కి పెట్టారని దీనికి కారణం కేంద్ర బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ అన్నారు.
బల్మూరు మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రిజర్వేషన్ పై అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాబర్ ఆంజనేయులు, భారీ మామ్, గడేల తిరుపతయ్య, రాజు, భాష నాయక్, చంద్రశేఖర్ రాజు తదితరులు ఉన్నారు.