- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం పటేలుగూడెం గ్రామానికి చెందిన గ్యార సాయిలు ఇటీవల మృతి చెందారు. గురువారం మాజీ ఎంపిటిసి,కాంగ్రెస్ నాయకుడు పిక్క శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో గ్యార అంజయ్య,గ్యార అశోక్, లింగాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -