Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్

కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుర కమీషనర్ మహెముద్ షేక్  సూచించారు. కల్వకుర్తి పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన విద్యానగర్ కాలనీ, గాంధీనగర్ కాలనీ, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేశారు. పట్టణంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని తెలిపారు. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు, విద్యుత్ స్తంబాలకు, పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘం అత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -