- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 17 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ విద్యార్థిని ప్రణతి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరేలి లో ఈ నెల 11 తేదీ నుంచి 15 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థినిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



