- Advertisement -
– వినియోగదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో అంతర్గత అత్యవసర మరమ్మత్తులు కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటలు నుండి నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ ఏడీఈ వెంకటరత్నం గురువారం తెలిపారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని అశ్వారావుపేట, దమ్మపేట, వినాయకపురం, నారంవారిగూడెం 33 కేవీ ఫీడర్ లో గల 33/11 కేవీ అశ్వారావుపేట, నారంవారిగూడెం, గంగారాం, వినాయకపురం, నారాయణపురం సబ్ స్టేషన్ లలో కలిగే విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
- Advertisement -


