Friday, November 7, 2025
E-PAPER
Homeకరీంనగర్పంచాయతీరాజ్ శాఖ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

పంచాయతీరాజ్ శాఖ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -

– తుది దశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలి

– ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

– వివిధ శాఖల పనులపై సమీక్ష సమావేశం

నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల
పంచాయతీ రాజ్ (పీఆర్) ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో విద్యా శాఖ, పంచాయతీ, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ భవనాలు, ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద జిల్లాలో మొదలు పెట్టిన పనులపై వివిధ శాఖల, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. జిల్లాలో 49 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు కాగా, పలు భవనాలు పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా పనులను పూర్తి చేసి, పిల్లలను ఆకట్టుకునే రంగులు వేయాలని, నీటి వసతి మిషన్ భగీరథ ద్వారా కల్పించాలని ఆదేశించారు.
గ్రామ పంచాయతీ భవనాల పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
భవిత కేంద్రాల భవనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గడువు పెట్టి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని 13 కేజీబీవీ ల్లో మంజూరు అయిన అదనపు తరగతి గదులు, మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చేయాలని సూచించారు. ఎంపీ ల్యాడ్స్ కింద జిల్లాకు మంజూరు అయిన పనులను వెంటనే మొదలు పెట్టి 15 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు.

పీహెచ్సీలు, సబ్ సెంటర్ల పనులను పూర్తి చేసి, వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించాలని సూచించారు. ఇంకా మొదలు పెట్టని పనులకు వెంటనే టెండర్లు చేయాలని, గడువులోగా పూర్తి చేయించి, ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, పనులను పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, డీఈఓ వినోద్ కుమార్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రజిత, జీసీడీఓ పద్మజ, డీపీఓ షర్ఫుద్దీన్, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.





- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -