– ముందు క్షమాపణ చెప్పండి : కల్నల్ సోఫియాపై మంత్రి వ్యాఖ్యల పట్ల సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: పాకిస్తాన్తో పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీ పై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు కు చేరింది. హైకోర్టు ఆదేశాలపై ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి పిటిషన్ను శుక్రవారం విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అంతేగాకుండా ఆయన తీరును తప్పుపట్టింది. ”ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి” అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కల్నల్ ఖురేషీని ఉద్దేశిస్తూ ఆమెను ‘ఉగ్రవాదుల సోదరి’ అని విజరు షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదికాస్త తీవ్ర దుమారం రేగడంతో మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు బుధవారం సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరణ్, జస్టిస్ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ… దేశంలో ఇంకా ‘సమగ్రత, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థం, గౌరవం, అజేయమైన ధైర్యం నిండి ఉన్న సంస్థ ఒక్క సైన్యం మాత్రమే’నని పేర్కొన్నారు. అటు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురద ృష్టకరమని పేర్కొంది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. విజరు షాను ‘మూర్ఖుడు’ అని ఆయన సంబోధించారు. మరోవైపు విజరు షాపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
ఇదేనా మాట్లాడే పద్ధతి?
- Advertisement -
- Advertisement -