- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం కల్లేడి గ్రామానికి చెందిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సిరికొండ మహేష్ తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఉన్న ప్రేమను తెలియజేయడానికి మహేష్ తన స్వంత పొలంలో వరి ధాన్యంతో పెద్దఅక్షరాల్లో జై కాంగ్రెస్ – రేవంత్ రెడ్డి అని రాసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా సిరికొండ మహేష్ మాట్లాడుతూ,రేవంత్ రెడ్డి నాయకత్వం మా యువతకు ప్రేరణ అని, రైతుల కోసం చేస్తున్న సేవలే నాకు ఈ సంకల్పం కలిగించాయి అని అన్నారు.
- Advertisement -



