నవతెలంగాణ – సదాశివనగర్
రైతులకు బోనస్ డబ్బులు చెల్లించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సదాశివనగర్ మండలం వజ్జెపల్లి తండాలో రైతులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తండాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ..ప్రకృతి వైపరీత్యాలు..అకాల వర్షం వల్ల రైతన్నలకు సరిగా దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నాలకు బోనస్ ఇవ్వడం హర్షదాయకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రమేష్, నాయకులు సర్దార్ నాయక్, భోజ్యనాయక్, సరిచంద్, రాంచంద్, బలిరామ్, ధూమనాయక్, బావుసింగ్, గోవింద్ ,హీరా, లాల్ సింగ్, మంగ్య, లక్ష్మణ్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సన్నాలకు బోనస్ చెల్లింపు.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



