- Advertisement -
18 మందికి భారీ జరిమాన
నవతెలంగాణ – కంఠేశ్వర్
మద్యం తాగి వాహనాలు నడిపిన 25 మంది లో 18 మంది కి భారీ జరిమానా విధించామని అందులో ఏడుగురికి జైలు శిక్ష పడిందని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 25 మందినీ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు నవంబర్ 25న పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ముందు ట్రాఫిక్ ఎస్.ఐ వంశీ కృష్ణ 17 మందిని హాజరు పరిచారు. ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున రూ.1,70,000/- ,ఒకరికి రూ.11000 మొత్తంగా రూ.181000 జరిమానా విధించామని తెలిపారు. ఏడు మందికి వారం రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
- Advertisement -



