- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేసీఆర్ మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వమని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కానీ.. గ్లోబల్ సమిట్లో ఆయన పిలిచిన అతిథులే తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని కొనియాడారు’’ అని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందన్నారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని కోరారు.
- Advertisement -



