Monday, December 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో డిసెంబర్‌ 17 నుంచి 22 వరకు శీతాకాల విడిది గడిపిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రపతికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికారు. కాగా ఆదివారం రాష్ట్రపతి నిలయం (బొల్లారం)లో నిర్వహించిన ‘ఎట్ హోమ్‌’ కార్యక్రమానికి సీఎం రేవంత్ తోపాటు పలువురు మంత్రులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ శీతాకాల విడిది సమయంలో రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు సీఎంతోపాటు రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెకు గౌరవంగా వీడ్కోలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -