Wednesday, May 21, 2025
Homeట్రెండింగ్ న్యూస్నిత్య పెండ్లి కూతురు.. 7 నెలల్లో 25 మందితో పెండ్లి

నిత్య పెండ్లి కూతురు.. 7 నెలల్లో 25 మందితో పెండ్లి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: పెండ్లి అంటే ఒకసారి.. మహా అయితే రెండు సార్లు.. అంతకు మించి ఊహించడం సాధ్యం కాదు. కానీ, ఇది మాత్రం నిజంగా షాకింగ్ న్యూసే.. ఓ యువతి.. ఏడు అంటే ఏడు నెలల్లో 25 పెళ్లిళ్లు చేసుకున్నది. ఇదెలా సాధ్యం.. పెండ్లి వేడుక అంటేనే ఓ నెల, రెండు నెలలు ఉంటుంది. అలాంటిది ఆ యువతి 7 నెలల్లో.. 25 మందిని పెండ్లి ఎలా చేసుకుంది? పూర్తి వివరాల్లోకి వెళ్లితే… యువతి పేరు అనురాధ(23). అనురాధ సొంత ఊరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్. ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుంది. ఇంట్లో గొడవలతో భర్తతో విడిపోయింది. ఆ తర్వాత.. ఈ యువతి పెండ్లి పేరుతో మోసాలు చేసే ఏజెంట్ల మాఫియాతో చేతులు కలిపింది. యువతి చూడటానికి అందంగా ఉంటుంది.. కొంచెం తెలివి ఉంది.. అంతకంటే ముఖ్యంగా అనుకువ, విధేయత చూపించటంలో సిద్ధహస్తురాలు. ఇదే ఆ ఏజెంట్లకు, యువతి అనురాధకు కలిసి వచ్చింది. వీళ్లందరూ ముఠాగా ఏర్పడి.. అనురాధను పెండ్లి కూతురుగా పరిచయం చేసి.. పెండ్లి తర్వాత జంప్ అయ్యేవారు. 

అనురాధ ఫొటోలను మ్యాట్రిమోనియల్ సైట్లతోపాటు లోకల్ పెండ్లిల బ్రోకర్లకు ఇచ్చే వారు ఏజెంట్లు. ఈ ఏజెంట్లే యువతి అనురాధ కుటుంబ సభ్యులుగా పరిచయం చేసుకునేవారు. ముఖ్యంగా రెండో పెండ్లి చేసుకోవాలనుకునే వాళ్లను టార్గెట్ చేసేవారు. రెండో పెండ్లిలోనూ.. ముఖ్యంగా 35, 40 ఏళ్ల వ్యక్తులను టార్గెట్ చేసేవారు.  పేద కుటుంబం, మంచి కుటుంబం.. చదువుకున్న అమ్మాయి.. ప్రయివేట్ ఆస్పత్రిలో ఉద్యోగం కూడా చేస్తుంది అని నమ్మించేవారు. దీంతో పెండ్లి ఖర్చులు అన్నీ పెండ్లి కొడుకు వాళ్లే పెట్టుకునే విధంగా మాట్లాడుకునే వారు. పెండ్లి తర్వాత.. వారం, పది రోజుల్లో ఓ అర్థరాత్రి సమయంలో పెండ్లి కూతురూ, ఏజెంట్లు అందరూ పరిపోయేవారు. ఆ తర్వాత వారం, 10 రోజుల్లో మరో పెండ్లి చేసుకునే వారు. అక్కడ కూడా అంతే.. పెళ్లయిన వారం, పది రోజులకు జంప్ అయ్యేవారు. ఇలా 7 నెలల్లో.. 25 పెళ్లిళ్లు చేసుకుని.. కోటి రూపాయల వరకు కొట్టేశారు.


రాజస్తాన్ మాధోపూర్ ప్రాంతానికి చెందిన శర్మ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్ తో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. శర్మను పెండ్లి చేసుకున్న అనురాధ.. పది రోజుల తర్వాత ఇంట్లోని బంగారం, డబ్బు, చీరలతో ఇంటి నుంచి పారిపోయింది. 2025 ఏప్రిల్ 20వ తేదీన రిజిస్ట్రర్ మ్యారేజ్ జరగ్గా.. మే 2వ తేదీ నుంచి పరార్ అయ్యింది. విచారణ చేయగా.. భోపాల్ లో గబ్బర్ అనే వ్యక్తిని పెండ్లి చేసుకున్నట్టు తెలిసింది. షాక్ అయిన శర్మ.. పోలీసులకు మొత్తం చెప్పేశాడు. దీంతో కొంత మంది పోలీసులు.. మఫ్టీలో.. పెళ్లి కొడుకుగా అనురాధ అండ్ చీటింగ్ ముఠాను సంప్రదించారు. అంతే మొత్తం ముఠా బాగోతం బయటపడింది. నిత్య పెండ్లి కూతురు అనురాధతో పాటు రోష్ని, రఘుబీర్, గోలు, మజ్ బూత్ సింగ్, అర్జున్ అనే వ్యక్తులను అరెస్ట్ పోలీసులు చేశారు. తాజాగా ఆమె గుట్టు రట్టవడంతో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -