- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండలానికి చెందిన బాషెట్టి భూమేశ్వర్ (54 ) కుటుంబ సభ్యులతో గగ్గుపల్లిలో ఉన్న వారి వ్యవసాయ భూమిలో పొలం పనులు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తో మరణించినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ సోమవారం తెలిపారు. పొలంలో ఉన్న బోరు మోటర్లు స్టార్ట్ చేస్తుండగా ప్రమాశాత్తు చేతి కరెంట్ తగిలినట్టు ఆయన తెలిపారు. భూమేశ్వర్ ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
- Advertisement -



