న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకోనుంది. గత సీజన్లో ఢిల్లీకి కెప్టెన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ స్థానంలో కెఎల్ రాహుల్కు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఐపిఎల్ మినీ వేలం ముగియడంతో కెఎల్ రాహుల్కు సారథ్య పగ్గాలు అప్పగిస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చింది. గతేడాది ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ను ఈ సీజన్లో ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. గత సీజన్లో ఢిల్లీకి రిషభ్ పంత్ స్థానంలో అక్షర్ పటేల్కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ఆ ఫ్రాంచైజీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. మరోవైపు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉన్నాడు.
దీంతో కేఎల్ రాహుల్ నాయకత్వంలో జట్టును మరింత బలోపేతం చేసేందుకు ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తోంది. గతంలో పంజాబ్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్కి కేఎల్ రాహుల్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. గత ఆరేళ్లుగా జట్టుకు ప్రధాన బలంగా కొనసాగుతున్నాడు. ఒకవేళ కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ.. కీలక ప్లేయర్గా జట్టులోనే కొనసాగుతాడు. కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా అక్షర్ కేవలం తన ఆల్రౌండ్ ప్రదర్శనపై దష్టి పెడితే జట్టుకు మరింత ప్రయోజనం ఉంటుందని కోచింగ్ స్టాఫ్ భావిస్తున్నట్లు టాక్. కాగా ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
కెఎల్ రాహుల్కు ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు?
- Advertisement -
- Advertisement -



