నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బి వెన్నెల రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని మాణిక్ బండార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన నెట్ బాల్ క్రీడ టోర్నమెంట్, సెలక్షన్స్ లో అత్యంత ప్రతిభ కనపరిచిన వెన్నెల రాష్ట్ర స్థాయినెట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 25, 26, 27 తేదీలలో మహబూబాబాద్ జిల్లాలోని కేస సముద్రములో జరిగే రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలలో వెన్నెల పాల్గొంటుందని పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్ తెలిపారు.
ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయినెట్ బాల్ పోటీలకు ఎంపికైన వెన్నెలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్, ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మెల్ల గంగాధర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయుల బృందం అభినందించారు. విద్యార్థిని విన్యాలకు మెమొంటోను అందజేశారు.రాష్ట్ర స్థాయి పోటీలలోమంచి ప్రతిభను ప్రదర్శించి పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు అందరికీ పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.



