శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ’45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మించారు. మైత్రి ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ‘అర్జున్ జన్య అద్భుతంగా స్టోరీని నెరేట్ చేశారు. తెలుగులో మా మూవీని మైత్రి రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. కన్నడలో ఆల్రెడీ సక్సెస్ అయింది. ఈ మూవీని చూస్తే కచ్చితంగా ప్రతీ ఒక్క ప్రాణిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు.
ఎన్ని రోజులు భూమ్మీద బతుకుతామో తెలీదు.. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలని ఈ మూవీ చెబుతుంది’ అని తెలిపారు. ‘మ్యూజిక్ డైరెక్టర్గా అర్జున్జన్య ఎంత సక్సెస్ అయ్యారో నాకు తెలుసు. ఈ కథను నెరేట్ చేసేటప్పుడు ప్రతీ పాత్రను యాక్ట్ చేసి మరీ చూపించారు. శివన్నని ఇంత వరకు ఇలా ఎక్కడా కూడా, ఏ సినిమాలో కూడా చూడలేదు. స్క్రీన్ ప్లే పరంగా అర్జున్ అద్భుతం చేశారు. నాకు ఇంత వరకు ఎవ్వరూ ఇవ్వని పాత్రను చాలా డేరింగ్గా అర్జున్ నాకు ఇచ్చారు’ అని ఉపేంద్ర చెప్పారు. దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ, ‘ఈ మూవీలో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు’ అని అన్నారు. నిర్మాత రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాని చూస్తే దీని విలువ తెలుస్తుంది. గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పిన చిత్రమిది’ అని తెలిపారు.
ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు.. గౌరవిస్తారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



