Wednesday, December 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాధ్యతగా గ్రామాలు అభివృద్ధి చేయాలి

బాధ్యతగా గ్రామాలు అభివృద్ధి చేయాలి

- Advertisement -

మిర్యాలగూడలో సర్పంచులు,
ఉప సర్పంచులు, వార్డు సభ్యుల
అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళవారం సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. అభినందన సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఖరీదుగా మారిన ఈ ఎన్నికలో సీపీఐ(ఎం) బలపర్చిన అభ్యర్థులుగా పోరాడి విజయం సాధించారని చెప్పారు. ఎన్ని ఒత్తిడిలొచ్చినా లొంగ కుండా పార్టీ, ప్రజల పక్షాన నిలబడడం గొప్ప విషయమన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వారికి అందుబాటులో ఉండి ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఎర్రజెండా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులుగా చేయాల న్నారు. మంచి ప్రజాప్రతినిధులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శులు రవినాయక్‌, పాదూరి శశిధర్‌రెడ్డి, రొండి శ్రీనివాస్‌, జాతంగి సైదులు, వన్‌ టౌన్‌, టూ టౌన్‌ కార్యదర్శులు డా.మల్లు గౌతమ్‌రెడ్డి, భావండ్ల పాండు, జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -