- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సురేష్ సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



