Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యవంతమైన సమాజమే నా లక్ష్యం

ఆరోగ్యవంతమైన సమాజమే నా లక్ష్యం

- Advertisement -

•సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ 
నవతెలంగాణ-మర్రిగూడ
ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే తన లక్ష్యం అని అందుకోసం తన శక్తి మేరకు పనిచేస్తానని మండలంలోని యరగండ్లపల్లి యువ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. గురువారం సర్పంచ్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో మాల్ లైఫ్ స్టార్ హాస్పిటల్ సహకారంతో గ్రామంలో నిర్వహించిన ఉచిత మైగా వైద్య శిబిరం సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామ అభివృద్ధితో పాటు,గ్రామంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తానని అన్నారు. మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

పుట్టిన ఊరుకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని సర్పంచ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని పేర్కొన్నారు. గ్రామస్తుల సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా పాలకవర్గ సహకారంతో ముందుకు వెళతానని తెలిపారు. వైద్యుల సూచన మేరకు గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైవ్ స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పోలేపల్లి వినోద్ కుమార్, వార్డు సభ్యులు, యూత్ నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -