నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు.జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి,మాజీ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని రుద్రారం,తాడిచెర్ల,ఎడ్లపల్లి గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో ఇంటింటా ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.నిరుపేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇందుకు మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్ బాబునే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్దిoచారు. కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు.పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో జంగిడి శ్రీనివాస్, జంగిడి సమ్మయ్య, చిన లింగయ్య,నాగరాజు, పాల్గొన్నారు.