- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. తొలుత ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో వీటిని అందించనున్నారు. అనంతరం అర్హులైన మహిళలందరికీ విడతల వారీగా పంపిణీ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించి, లబ్ధిదారులను గుర్తించి కుట్టుమిషన్లు అందజేస్తారు.
- Advertisement -



