- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన గుంటి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ శనివారం మృతుని కుటుంబాన్ని పరమర్షించి, అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని బస్తా సన్నబియ్యం, వంట సామగ్రిని అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు లాకావత్ రాజేందర్,లచ్చయ్య, రవీందర్ నాయక్,మల్లేష్, గుంటి బాపు ,బిస్కుల అశోక్, సురేష్, శ్రీనివాస్ , సమ్మయ్య, రాజయ్య, సత్యం, ఎల్లయ్య, కుమార్, విష్ణువర్ధన్, మహేందర్ పాల్గొన్నారు.
- Advertisement -



