- Advertisement -
నవతెలంగాణ – తుంగతుర్తి
తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో వడదెబ్బ తగిలి మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి చెందిన మల్లెపాక నిర్మల (43) మిరప తోటలో కూలికి వెళ్లి తీవ్ర ఎండ దెబ్బ తగిలి సోమవారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మహిళకు భర్త వీరన్న, ఒక కుమారుడు ఉన్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



