- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏఐ రాకతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్నప్పటికీ, తాము మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పేర్కొంది. ఆటోమేషన్, ఏఐ టూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ గతేడాది తమ కంపెనీ ఉద్యోగాలు తొలగించలేదని, భవిష్యత్తులోనూ లేఆఫ్స్ ఉండవని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. ఐటీ ఇండస్ట్రీలో ఏఐ అనేది కీలక మార్పు అని, అయితే అది వెంటనే ఉద్యోగాలను తీసేయదన్నారు.
- Advertisement -



