- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అసోల్ కౌంటింగ్ కేంద్రంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాటలు జరిగాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో, ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో బారక్పూర్ ఉద్రిక్తత నెలకొంది. కూచ్ బెహార్లోని దిన్హాటాలో BJP, TMC కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర బలగాల సిబ్బంది లాఠీచార్జికి దిగారు.
- Advertisement -



