Friday, May 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రధాని మోడీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

ప్రధాని మోడీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
మే 10న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా తెలంగాణలో  వేలకోట్ల అభివృద్ధి పనులకి  శంకుస్థాపన, ప్రారంభోత్సవంతో శ్రీకారం చుట్టానున్నట్లు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కంతుల శంకర్ శుక్రవారం ఒక  ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో రైల్వే, జాతీయ రహదారులకు అత్యధిక బడ్జెట్ కేటాయించి, రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం పనులు, వరంగల్లోఎయిర్ పోర్ట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తో మోడీ సర్కార్ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు పరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు, ప్రజలు అభిమానులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -