- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాకినాడ గాంధీనగర్లో నడుచుకుంటూ వెళ్తున్న ఎపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు.. పాత కక్షల కారణంగానే హత్య జరిగిందా? లేక ఇతర వ్యక్తిగత కారణాలున్నాయా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.
- Advertisement -



