- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. అయితే మిత్ర పక్షాలు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో టీవీకే తేలిగ్గా బలపరీక్షను నెగ్గనుంది. టీవీకే మొత్తం 108 సీట్లు గెలవగా విజయ్ ఒకచోట రాజీనామా చేయడం, ఒక్క ఓటుతో గెలిచిన శ్రీనివాస్ ఫ్లోర్ టెస్టులో పాల్గొనవద్దని హెచ్ సీ చెప్పడంతో ఆ పార్టీ బలం 106కు పడిపోయింది. అయితే మిత్రపక్షాల మద్దతుతో 120కి పెరిగింది. 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో 150 మందితో విజయ్ బలపరీక్ష నెగ్గనున్నారు.
- Advertisement -



