- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పోలీసులు హవాలా రాకెట్ గుట్టు రట్టు చేశారు. ధన్కుటి ఏరియాలో ఇల్లీగల్ ట్రేడింగ్ చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో 61 కిలీల వెండి, రూ.2 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ కరెన్సీని రికవర్ చేశారు. ఇల్లీగల్ ట్రేడింగ్, బెట్టింగ్, హవాలా జరుగుతోందన్న సమాచారంతో సోదాలు చేసినట్లు అడిషనల్ డీసీపీ సుమిత్ రామ్టేకే తెలిపారు. విదేశీ గ్యాంగ్ హస్తంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
- Advertisement -



