ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో…సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
సామాన్యుడుకి చేతిలో సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని మండల సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాలెండర్ 2026ను ఉపాధిహామీ ఎపిఓ హరీష్ తో కలిసి శుక్రవారం తాడిచెర్ల ఎంపిడిఓ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని అన్నారు. అవినీతి నిర్మూలనకు దోహద పడుతుందని, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతలకుమార్ యాదవ్, మల్లారం సర్పంచ్ మేకల రాజయ్య, ఉప సర్పంచ్ అవిర్నేని పురుషోత్తంరావు, ఉపాధిహామీ, ఎంపిడిఓ సిబ్బంది పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం సామాన్యుడుకి వజ్రాయుధం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



