- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు : మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. కమిటీ ఎన్నిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ అధ్యక్షునిగా రామావత్ బాలు ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బల్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లమల్ల రాంప్రసాద్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు బలరాం నాయక్, ST సెల్ అధ్యక్షులు కృష్ణ నాయక్, గ్రామ సర్పంచ్ పద్మ రాముడు, యూత్ కాంగ్రెస్ స్వామి, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



