- Advertisement -
మండల ప్రజలకు వేడుకల శుభాకాంక్షలు
నవతెలంగాణ – మద్నూర్
సోమవారం మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో మద్నూర్ మండల జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు సందూర్వార్ హనుమాన్లు మాట్లాడుతూ.. తోటి మిత్రులైన జర్నలిస్టులందరికీ అలాగే మండల ప్రజలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆల్ పార్టీ నాయకులకు గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షులు శివాజప్ప, ప్రధాన కార్యదర్శి బాలు, జెయింట్ సెక్రెటరీ పండరి, కోశాధికారి నాగేష్ గౌడ్, సీనియర్ నాయకులు జర్నలిస్టుల సంఘం సలహాదారులు సంఘయప్ప, డోంగ్లి మనోహర్ మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.
- Advertisement -



