- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులోని ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని నిర్మూలించేందుకు TVK అధినేత, సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు లంచం తీసుకున్నట్లు గుర్తించి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. రూ. వెయ్యి లంచం తీసుకున్న వారిపై ఫిర్యాదు చేసినా ఈ బహుమతి ఇస్తామని తెలిపారు. సీఎం విజయ్ నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాలో చర్చ మొదలైంది.
- Advertisement -



