- Advertisement -
నవతెలంగాణా – జన్నారం : జన్నారం మండలం చింతగూడ బస్ స్టేజి వద్ద ఎక్స్ ప్రెస్ బస్సుల రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ గురువారం ఆదిలాబాద్ డిపో ఆర్ఎంకు వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి (లక్ష్మీదేవి ) దర్శనానికి ఏటా వేలాదిగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ స్టాప్ ఎంతగానో అవసరమని, దీనివల్ల భక్తుల ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయని ఆమె పేర్కొన్నారు. వెంటనే ఆర్ఎం స్పందించి చింతగూడ స్టేజి వద్ద ఎక్స్ప్రెస్ బస్సులను నిలుపుదల చేయాలని కోరారు.
- Advertisement -



