నవతెలంగాణ – ఆర్మూర్ : గతంలో కోర్ట్లో మూడు సంవత్సరాలు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తించి ఖమ్మం జిల్లా మధిర కోర్ట్ కు బదిలీ పై వెళ్లినా జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోకి గురువారం బార్ అసోసియేషన్ హాల్ లో సన్మానించారు. సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.భవ్యశ్రీ తదితరులు పాల్గొని ఈ సందర్బంగా ఆమె గతంలో పని చేసిన అనుభవలను న్యాయ వాదులతో కలిసి పంచుకున్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు పూల బొకే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుదురుపాక ప్రవీణ్ చందర్, ఉపాధ్యక్షులు గుంజల సుదర్శన్, సెక్రటరీ పోడేటి శంకర్,ట్రెజరర్ రాజేందర్,జాయింట్ సెక్రటరీ ఎంకే నాగరాజ్,న్యాయవాదులు లోక భూపతి రెడ్డి, గంట సదానందం, గంగారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎంకే నరేందర్, ఏలేటి గంగాధర్, కృష్ణ పండిత్ రూయ్యడి రాజేశ్వర్, జక్కుల శ్రీధర్, అమితాబ్ కిరాడ్, బేతు జగదీష్, షిండే, జంగా మురళిదర్, ఆవరి రమేష్, గంట విప్లవ్ కిరణ్, కొండి పవన్, గంగారాం, బాలయ్య, ఎంకే నవ్య తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జి వేముల దీప్తికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



