- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కుష్టు వ్యాధి వ్యతిరేక దినంగా స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల ఎలాంటి భేదాభిప్రాయాలు చూపకుండా, వ్యాధి పూర్తిస్థాయి నిర్మూలనకు కృషి చేస్తామని ఆరోగ్య కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య, వైద్య సిబ్బంది స్వామి, హరిత, సతీష్, యశోద, స్వరూప, శ్యామల, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



