- Advertisement -
నవతెలంగాణ-మల్హర్రావు: మండలం పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మీమల్లు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం,తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.అనంతరం దహన సంస్కారాలకు రూ.7500 ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్,మాజీ సర్పంచ్ రాజునాయక్,వార్డు సభ్యులు బియ్యని రాజమౌళి,కందుగుల సమ్మక్క,పింగళి వంశీ, తాటికొండ కేశవచారి,బియ్యని కుమార్, బొడ్డు మల్లేష్, గైనరేష్,అడ్డూరి శివ,మందపల్లి అంజి పాల్గొన్నారు.
- Advertisement -



