25 శాతం నుంచి 18 శాతానికి..: ట్రంప్
ఆనందంగా ఉన్నది : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : భారత్పై విధిస్తున్న టారిఫ్లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే.”ఇవాళ భారత ప్రధాని మోడీతో మాట్లాడాను. నా అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఆయననొకరు. శక్తివంతమైన నేత. ఇరువురం వాణిజ్యం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతోపాటు అనేక అంశాలపై చర్చించాం. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసి.. అమెరికా, వెనిజొలా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయడానికి మోడీ అంగీకరించారు.
ఈ నేపథ్యంలో తక్షణమే అమల్లోకి వచ్చేలా అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మేం అంగీకరించాం. అని పోస్టు చేశారు.అంతేకాకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ముందుకొస్తుంది. సుమారు 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇంధన, సాంకేతిక, వ్యవసాయ, బొగ్గు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. భారత్తో సంబంధాలు భవిష్యత్లో మరింత బలోపేతం కానున్నాయి.” అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతపై భారత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.టారిఫ్లను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.
‘ఐరోపా సైన్యం’ ఏర్పాటు.. అత్యంత ప్రమాదకరం: ఈయూ ప్రతినిధి
గ్రీన్లాండ్ విషయంలో ఇటీవల అమెరికా, ఐరోపా దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యురోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, దీన్ని ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ వ్యతిరేకించారు. ఐరోపా సైన్యం ఏర్పాటు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.



