- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడి లోయలోపడి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో జరిగింది. హిమాచల్ప్రదేశ్ సిమ్లా జిల్లాలోని ఛోపాల్ నుంచి హెచ్ఆర్టిసి (హిమాచల్ప్రదేశ్ రోడ్డు రవాణా కార్పొరేషన్) బస్సు 35 మంది ప్రయాణీకులతో పాంట సాహిబ్కు వెళుతుండగా ఉత్తరాఖండ్లోని క్వాను వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
- Advertisement -



