నాణ్యతగా పనులు చేయాలి
సర్పంచ్ నాగరాజు గౌడ్
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామంలో అన్ని వార్డులు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చిల్వేర్ గ్రామాన్ని రాజకీయాలకతీతంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మంగళవారం మండలంలోని చిల్వేర్ గ్రామంలో పంచాయతీ ఏఈ సత్య కృష్ణతో కలిసి అంగన్వాడి బిల్డింగ్, అండర్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు గౌడు మాట్లాడుతూ.. ప్రతి పనిలో నాణ్యత ఉండాలని సూచించారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ రన్నింగ్ గా చేస్తున్నామని చెప్పారు.
మండలంలోని గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో ఎక్కువ నిధులు మంజూరు చేయించుకుని అభివృద్ధి బాటలో నడిపిస్తానని అన్నారు. ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యం గౌడ్, ఉపసర్పంచ్ మోహన్, పంచాయతీ కార్యదర్శి ఖలీల్, వార్డ్ మెంబెర్స్ మల్లేష్, హుస్సేన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



