Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హౌసింగ్ బోర్డ్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 

హౌసింగ్ బోర్డ్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి విచ్చేసి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సందర్భంలోనూ  ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ రాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవ్ టీజింగ్ మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని అన్నారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. బయటి రాష్ట్రాల నుండి బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇళ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడిన యజమానులపై కూడా కేసులు నమోదు అవు తాయని గుర్తుంచుకోవాలని సూచించారు. 

దాదాపు 70 మంది పోలీసు అధికారులు  సిబ్బంది పాల్గొని దాదాపు 120 ఇండ్లు  సరైన ధ్రువపత్రాలు లభించని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 5 మందిని గుర్తించారు.నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్  మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఆటోలు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్,రూరల్ సీఐ  9 మంది ఎస్సైలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -