నవతెలంగాణ-పెద్దవూర: ఈ నెల 24 న వీచిన ఈదురు గాలలకు మండలంలోని సంగారం గ్రామంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరి పోయాయి. దాంతో వారంతా ఇండ్ల ముందు గుడిసెలు వేసుకొనిజీవనం సాగిస్తున్నారు. ఈ విషయం స్థానిక సర్పంచ్ ఈసం రమేష్ ద్వారా తెలుసుకొని శుక్రవారంబుసిరెడ్డి పౌండేశన్ ఛైర్మెన్ పాండన్న సంగారం గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాలైన కంచర్ల శ్రీనివాస్ రెడ్డి,తరి లక్ష్మమ్మ,అలేటి చందన, మాతంగి భాస్కర్ లను పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకుని ఒక్కో కుటుంబానికి 5,000 ల చొప్పున 20,వేలు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో లో వల్లేం వెంకటనారాయణ,ఇరుమాది రవిందర్ రెడ్డి,యూత్ అధ్యక్షులు తరిరవి,మర్రిసాయి,నరేష్ వెమ్మలరెడ్డి,సందీప్,వూరే కోటేష్,కంచర్ల వెంకటరెడ్డి,తరిబిక్షం,ఈసం పిచ్చయ్య,గ్రామ యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



