నవతెలంగాణ-హైదరాబాద్: టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో విమానంను కోల్కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సదురు విమానం నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్కు బయలుదేరింది. విమానం కోల్కతా గగనతలంలోకి వచ్చిన సమయంలో.. ఇంజిన్ లోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు పైలట్ గమనించాడు. దీనితో పరిస్థితి తీవ్రంగా మారడంతో.. పైలట్ వెంటనే కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించాడు.
పరిస్థితిని అంచనా వేసిన కోల్కతా ATC.. వెంటనే వారి నుంచి అనుమతి లభించిన వెంటనే విమానాన్ని అత్యంత జాగ్రత్తగా రన్వేపై దింపారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదం టెక్నికల్ లోపం కారణంగా జరిగిందా లేదా మరో విషయమా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 225 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.



