తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
పాలకవర్గం, అధికారులతో సంయుక్తంగా ముందుకు వెళుతూ గ్రామాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ బండి స్వామి అన్నారు. సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పెద్ద సమస్యలుగా మారిన కుక్కలు, కోతులు, పందుల బెడదపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోతామని తెలిపారు.
ప్రభుత్వం 200 యూనిట్లు జీరో బిల్లులు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు పొదుపుగా వాడుకోవాలని కోరారు. వార్డులో విద్యుత్ సమస్యలపై ఎప్పటికప్పుడు వార్డు సభ్యుల, తన దృష్టికి తీసుకువస్తే తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిస్కారం అయ్యేలా చూస్తున్నారు. 6,7,8 వార్డులతోపాటు పాత హైస్కూల్ నుంచి పెంజేరువు మీదుగా ఎస్సి కాలనీ వరకు కొన్ని నెలలుగా అంధకారంలో ఉన్నందున ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లుగా పేర్కొన్నారు.
వేంటనే విద్యుత్ దీపాలు పెట్టాలని పలువురు కోరారు. అనంతరం పలు అభివృద్ధి పనులు, పలు సమస్యల పరిస్కారంపై పాలకవర్గం తీర్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య, తిర్రి అశోక్, ఇందారపు సారయ్య, పైడాకుల దేవేంద్ర, నారామల్ల రాజేశ్వరి, అంగన్ వాడి టీచర్లు,ఆ శాలు, వైద్య సిబ్బంది, జీపీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.



