- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ ఘాతంతో శుక్రవారం మండలంలోని నారంవిరిగూడెంలో పూరిళ్ళు దగ్ధం అయింది. వై.కోటేశ్వరరావుకు చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ ఘాతం చోటు చేసుకుని గృహం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల 90 వేలు నష్టం వాటిల్లింది అని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. బాదితులు కట్టుబట్టలతో ఉండిపోయారని వారు వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ఉన్నపలంగా మా కుటుంబమంతా రోడ్డుమీదకి వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాదితులు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



