నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ను, దానికి మద్దతుగా నిలిచిన ఎఐఎడిఎంకెను ఖండిస్తూ లౌకిక ప్రగతిశీల కూటమి ఫిబ్రవరి 12వ తేదీ (గురువారం) నిరసన చేపట్టనుందని డిఎంకె కూటమి శనివారం తెలిపింది. ఫిబవ్రరి 12న ఉదయం 10.30 గంటలకు ఈ నిరసన ప్రారంభం కానుంది. కార్పొరేషన్లు, పట్టణ, పంచాయతీ స్థాయిలో ఆరోజు క్షేత్రస్థాయి నుంచి నిరసనలు జరగున్నట్లు డిఎంకె కూటమి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
కేంద్ర బడ్జెట్లో తమిళనాడు పట్ల నిరక్ష్యం వహించడం, ఎంజిఎన్ఆర్ఇజిఎ ఉపాధి హక్కు చట్టం రద్దు చేయడం, భారత్ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలకు ఖండిస్తూ నిరసన చేపట్టనున్నట్లు ఈ ప్రకటన పేర్కొంది. కేంద్రం తమిళనాడు విద్యకు 3,458 కోట్లు, వంద రోజుల ఉపాధిహామీ చట్టం కింద రెండువేల కోట్లును విడుదల చేయలేదు. తమిళనాడు అభివృద్ధి బడ్జెట్లో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా కేటాయింలేదు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడు ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
బడ్జెట్లో తమిళనాడుకి ఇంత అన్యాయం జరిగినా ఎఐఎడిఎంకె పార్టీ మాత్రం మద్దతు ఇచ్చింది. అందుకే కేంద్ర బడ్జెట్కి, దానికి మద్దతు ఇచ్చిన ఎఐఎడిఎంకెకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు డిఎంకె కూటమి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.



