నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ మాల్వియా నగర్లోని ఒక రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 21మంది సజీవ దహనమైయ్యారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. తాజాగా అగ్నిప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఢిల్లీ డివిజనల్ అధికారి (DO) రవీందర్ సింగ్ తెలిపారు.
సహాయక చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి. మంటలు పూర్తిగా ఆరిపోయాయి. బాధితులను ఆసుపత్రికి తరలించాము.” అధికారుల వివరాల ప్రకారం, మాల్వియా నగర్లోని ‘ఫ్లోరిష్ స్టే B&B’లో ఉదయం 8:48 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించగా, కనీసం 21 మంది మరణించారు, 40 మందికి పైగా సురక్షితంగా రక్షించబడ్డారని ఆయన వెల్లడించారు.



